నెల్లూరులో రేపు సాయంత్రం జరగాల్సి వున్న ఆక్సీజెన్ సినిమా ఆడియో లాంచింగ్ ఈవెంట్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ చిత్ర నిర్మాతలు. ఆక్సీజెన్ సినిమా హీరో గోపీచంద్ ప్రస్తుతం తన వ్యక్తిగత పనులపై స్వట్జర్లాండ్లో వెళ్లినందునే ఈ ఈవెంట్ని రద్దు చేసుకుంటున్నామని యూనిట్ వెల్లడించినట్టు సమాచారం. రద్దయిన ఆడియో లాంచింగ్ ఫంక్షన్ని తర్వాత మరో తేదీని ప్రకటించి హైదరాబాద్లో జరిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏ.ఎం. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ ఐశ్వర్య నిర్మించారు.
గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ జగపతి బాబు మరో ప్రధాన పాత్రలో నటించాడు.
గోపీచంద్ సరసన రాశి ఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ జగపతి బాబు మరో ప్రధాన పాత్రలో నటించాడు.