పద్మావత్ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం నడిచింది, ఆ మాటకొస్తే ఇంకా నడుస్తోంది. ఈ సినిమా వల్ల తమ మనోభావాలను దెబ్బతిన్నాయంటూ ఉత్తరాదిన రాజ్పుత్లు విడుదలను అడ్డుకున్నారు. గుజరాత్లో ఈ మూవీ విడుదల సమయంలో ఆందోళనలు తలెత్తి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూవీ విడుదలకు సుప్రీం పచ్చజెండా ఊపినా.. ‘పద్మావత్’కు కష్టాలు తప్పలేదు. కానీ ‘ఉడ్తా పంజాబ్’ను మించిపోయేలా వివాదాస్పదమైన సంజయ్ లీలా భన్సాలీ సినిమాపై రాజస్థాన్ హైకోర్టు ప్రశంసలు గుప్పించింది.
రాజస్థాన్ హైకోర్ట్ జడ్జి సోమవారం 200 మంది భద్రతా సిబ్బంది పహారా మధ్య ‘పద్మావత్’ చూశారు. అనంతరం ఈ సినిమా విషయమై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలో రాణి పద్మావతి గొప్పదనాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. రాజ్పుత్ల మనోభావాలను దెబ్బతీసేలా చారిత్రాక వాస్తవాలను వక్రీకరించలేదు. పద్మావతి పాత్రను సమతూకంతో ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇది మన రాష్ట్ర చరిత్ర. దీన్ని చూసి మనమంతా గర్వించాలి. ఈ సినిమా మన దేశ గత వైభవాన్ని చూపించింది. యావత్ దేశం గర్వించాలి.’ అని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు.
‘పద్మావత్’పై కర్ణిసేన నమోదు చేసిన కేసులను న్యాయమూర్తి కొట్టేశారు. సినిమా విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా భద్రత కల్పించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. న్యాయస్థానం తమ కేసులను కొట్టివేసినప్పటికీ.. సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపడతామని కర్ణిసేన నాయకులు చెప్పడం కొసమెరుపు.
రాజస్థాన్ హైకోర్ట్ జడ్జి సోమవారం 200 మంది భద్రతా సిబ్బంది పహారా మధ్య ‘పద్మావత్’ చూశారు. అనంతరం ఈ సినిమా విషయమై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలో రాణి పద్మావతి గొప్పదనాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. రాజ్పుత్ల మనోభావాలను దెబ్బతీసేలా చారిత్రాక వాస్తవాలను వక్రీకరించలేదు. పద్మావతి పాత్రను సమతూకంతో ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇది మన రాష్ట్ర చరిత్ర. దీన్ని చూసి మనమంతా గర్వించాలి. ఈ సినిమా మన దేశ గత వైభవాన్ని చూపించింది. యావత్ దేశం గర్వించాలి.’ అని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు.
‘పద్మావత్’పై కర్ణిసేన నమోదు చేసిన కేసులను న్యాయమూర్తి కొట్టేశారు. సినిమా విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా భద్రత కల్పించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. న్యాయస్థానం తమ కేసులను కొట్టివేసినప్పటికీ.. సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపడతామని కర్ణిసేన నాయకులు చెప్పడం కొసమెరుపు.