యాప్నగరం

పద్మావతి సెట్స్ పై మళ్లీ దాడి

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

TNN 15 Mar 2017, 3:20 pm
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాణి పద్మిని జీవిత చరిత్రను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం. రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా కొన్ని వారాల క్రితం జైపూర్లోని జయఘడ్ కోటలో షూటింగ్ చేస్తుండగా కర్ణిసేన కార్యకర్తలు దాడి చేశారు. రాణిపద్మినిని అవమానించే విధంగా సినిమా తీస్తున్నారని ఆరోపించారు. భన్సాలీ జుట్టుపీకి, చేయి చేసుకున్నారు. అక్కడున్న సినిమా సెట్ అంతా నాశనం చేశారు. దీంతో భన్సాలీ షూటింగ్ ను కొన్ని రోజుల పాటూ వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ కొన్ని రోజుల నుంచి షూటింగ్ చేస్తున్నారు. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. దాంతో ఆసెట్ లో చాలా భాగం దగ్ధమైంది. ఆ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎక్కడా షూటింగ్ చేసినా దాడులు జరుగుతుండడంతో ఆ చిత్ర యూనిట్ భయభ్రాంతులకు గురవుతోంది.
Samayam Telugu padmavati sets vandalised set on fire in kolhapur
పద్మావతి సెట్స్ పై మళ్లీ దాడి


ఈ సినిమాలో అందాల బొమ్మ రాణి పద్మినిగా దీపికా పదుకునే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్, రాజా రావల్ రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. చరిత్రను మార్చి సినిమా తీస్తున్నారని రాజవంశస్థులు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.