యాప్నగరం

ముంబై భామలకు వర్షం దెబ్బ

భారీ వర్షాలతో ముంబై ఒక్కసారిగా పూర్తిగా నీటితో నిండిపోయింది. అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి.

TNN 30 Aug 2017, 8:55 pm
భారీ వర్షాలతో ముంబై ఒక్కసారిగా పూర్తిగా నీటితో నిండిపోయింది. అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. దీంతో సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్ తారలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బాలయ్య 'పైసా వసూల్' సినిమాలో నటించిన కైరా దత్ ఎయిర్ పోర్ట్‌లోనే చిక్కుకుపోయింది. ఆమెతో పాటు చాలా మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారని ట్వీట్ చేసింది. అలానే మరో బ్యూటీ ఇలియానా తన సినిమా షూటింగ్స్, కొత్త సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా రద్దు చేసేసుకుంది. ఇక కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ అయితే తన కారుతో పాటు రోడ్డు మధ్యలో నీటిలో మునిగిపోయిన వీడియోను షేర్ చేసింది.
Samayam Telugu paisa vasool actress kyra dutt stranded in mumbai airport
ముంబై భామలకు వర్షం దెబ్బ


కాజల్, హన్సిక తాప్సీ వంటి హీరోయిన్లు వర్షాల్లో చిక్కుకున్న వారందరూ జాగ్రత్తగా ఉండమని సందేశాలు పంపుతూ.. హెల్ప్ లైన్ నెంబర్లు ట్వీట్ చేస్తున్నారు. సిటీ మొత్తం కరెంట్ పోవడంతో నటి సోనాక్షి సిన్హా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ముంబై వెళ్లాల్సిన నటి శ్రియ తన ప్రయాణం మానుకొని హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. మొత్తానికి వర్షాల కారణంగా ముంబై భామలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.