యాప్నగరం

రొమాన్స్ చేయడం చాలా ఈజీ.. అలాంటి సీన్స్ నాకు ఇష్టం: రాశీ ఖన్నా

మ్యాచో స్టార్‌ గోపీచంద్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ 'పక్కా కమర్షియల్'. జులై 1న విడుదల కానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. ఓ ఇంటర్వ్యూలో రాశీ కన్నా మాట్లాడుతూ..

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Jun 2022, 4:50 pm
Samayam Telugu రాశీ ఖన్నా
కామెడీ సీన్స్ చేయడం కన్నా.. రొమాంటిక్ సీన్స్‌లో నటించడమే ఇష్టమని అంటోంది స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా. ఆమె హీరోయిన్‌గా, గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్'. జులై 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా ఇంటర్వ్యులతో బిజిబిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ ఆసక్తిర విషయాలు బయటపెట్టింది.

కామెడీ చేయడం కష్టమని.. కానీ రొమాన్స్ సీన్స్‌లో నటించడం సులభమంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని అడగ్గా ఆమె ఈవిధంగా సమాధానం ఇచ్చింది. 'నాకు రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం. కామెడీ సీన్స్ కంటే.. రొమాంటిక్ సీన్లలో నటించడమే సులభం. ఇప్పటివరకు నేను రొమాంటిక్ సీన్లలో యాక్ట్ చేశా. ప్రస్తుతం కామెడీ జోనర్‌ను ఎంజాయ్ చేస్తున్నా..' అని రాశీ కన్నా చెప్పుకొచ్చింది.

పక్కా కమర్షియల్ మూవీతో తన కామెడీ బాగుంటుందని ఈ అందగత్తె చెప్పింది. ఈ సినిమాలో నల్లకోటు ధరించిన రాశీ కన్నా.. గోపీచంద్‌తో కలిసి పోటీపడి కామెడీని పండించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ ముద్దుగుమ్మ లుక్ ఆకట్టుకుంది. లేడీ లాయర్‌గా తనదైన శైలిలో ఒదిగిపోయి యాక్ట్ చేసినట్లు అర్థమవుతోంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.