యాప్నగరం

Akhil Akkineni: ‘Mr.మజ్ను’.. అత్తారింటికి దారుందా?

తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో తన మూడో చిత్రంపై ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు అఖిల్. ప్రస్తుతం తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Samayam Telugu 1 Nov 2018, 11:53 am
దేవదాసు మనవడో .. మన్మథుడికి వారసుడో .. కావ్యములో కాముడో .. అంతకన్నా రసికుడో.. అంటూ అక్కినేని వారసుడు అఖిల్ అమ్మాయిల వెంటపడే రోమియోగా ‘మిస్టర్ మజ్ను’ టీజర్‌తో హల్ చల్ చేస్తున్నాడు. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో తన మూడో చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ నవ మన్మథుడు. ‘తొలిప్రేమ’ చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ మజ్నుతో జోడి కడుతుంది. ఇటీవల విడదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రెండు పాటలు, రెండు ఫైట్స్ సీక్వెన్సులు మినహా దాదాపు పూర్తయినట్లే. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.
Samayam Telugu మిస్టర్ మజ్ను

ఈ చిత్రంలో లవర్ బాయ్‌గా, అమ్మాయిల వెంటపడే రోమియోగా మిస్టర్ మజ్ను ఉంటున్నప్పటికే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటి దారేది’ చిత్ర ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని టాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కువగా వినిపిస్తున్నమాట. దీంతో పవన్ ప్రభావం అఖిల్‌పై ఉండనే ఉండనుందని తెలుస్తోంది. కొన్ని సీన్లు ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని పోలి ఉండినప్పటికీ కథ, కథనాలు వెంకీ అట్లూరి స్టైల్‌లో ఉంటాయని తెలుస్తోంది. క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం అఖిల్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని చాలా సార్లు చూశారట కూడా. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.