పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 19 మంగళవారం నాడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో సినిమా ట్రైలర్ను విడుదల చేస్తారని దాని కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి 'అజ్ఞాతవాసి' టీం నుండి ఊహించని షాక్ తగలబోతుంది.
ముందుగా ట్రైలర్ను విడుదల చేయాలనుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కట్ విషయంలో తృప్తి చెందని త్రివిక్రమ్ ట్రైలర్ విడుదలను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నాడు. ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్రైలర్ను సిద్ధం చేసి వచ్చే వారంలో విడుదల చేయాలని చూస్తున్నాడు. అదే గనుక నిజమైతే ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశ చెందక తప్పదు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ముందుగా ట్రైలర్ను విడుదల చేయాలనుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కట్ విషయంలో తృప్తి చెందని త్రివిక్రమ్ ట్రైలర్ విడుదలను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నాడు. ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్రైలర్ను సిద్ధం చేసి వచ్చే వారంలో విడుదల చేయాలని చూస్తున్నాడు. అదే గనుక నిజమైతే ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశ చెందక తప్పదు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు.