యాప్నగరం

Pawan Fans: పోసానిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడికి యత్నం.. ప్రెస్ మీట్‌లో రచ్చ రచ్చ

మంగళవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పోసాని క్రిష్ణమురళి ప్రెస్ మీట్ రసాభసగా మారింది. పవన్ కళ్యాణ్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై దాడికి యత్నంచారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

Samayam Telugu 28 Sep 2021, 7:56 pm
నటుడు పోసాని పోసాని కృష్ణ మురళిపై దాడికి యత్నంచారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మంగళవారం నాడు హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పోసాని ఫైర్ అయ్యారు. అయితే మీడియా సమావేశం ముగిసిన తరువాత బయటకు వచ్చిన పోసాని.. కొన్ని ఛానల్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకి ప్రాణ హాని ఉందని.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతని సైకో ఫ్యాన్స్ ద్వారా నన్ను కొట్టించాలని చంపించాలని చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా చనిపోవాల్సిందే.. అందుకే నా ప్రాణ రక్షణ కోసం నేను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయబోతున్నా. అతను దుర్మార్గుడో అన్ని బయటపెట్టబోతున్నా.. అని చెప్తుండగా.. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా పోసాని మీదికి దూసుకుని వచ్చి మెరుపు దాడికి యత్నంచారు. ప్రెస్ మీట్ ముగించుకొని వచ్చిన పోసానిపై పోలీసుల ముందే దాడికి ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ అభిమానులు.. దీంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
Samayam Telugu పోసానిపై దాడి
pawan kalyan fans attack on posani krishna murali


ఈ మెరుపు దాడికి పోలీసులు అప్రమత్తమై.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. తమ అభిమాన నాయకుడిపై పర్సనల్ అటాక్ చేస్తే ఊరుకునేది లేదంటూ.. హైదరాబాద్‌లో పోసానికి తిరగనివ్వం అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే దాడి సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వందేమాతరం అని నినాదాలు చేయడం హాస్యాస్పదం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.