Pawan Kalyan: హరిహర వీర మల్లు అప్డేట్.. రంగంలోకి పవన్ కళ్యాణ్
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ నెలలో తరువాత షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రీ వర్క్ షాప్ను నిర్వహించారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ వచ్చింది. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ప్రీ షెడ్యూల్ వర్క్షాప్ను మొదలుపెట్టేసింది. ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు నేడు ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ (Krish)తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani), ఇతర నటీనటులు, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో పవన్ ఓ డైలాగ్ కూడా చెప్పాడు. 'ఉన్నతమైన భాష మాట్లాడి.. నీచపు ఆలోచన.. ముతక భాష మాట్లాడి.. ఉన్నతమైన ఆలోచన..' అంటూ మాట్లాడాడు. రైటర్స్ అందరూ ఒకే చోట కూర్చొని డిస్కర్షన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్స్ పవన్ యాక్ట్ చేసి చూపించాడు. నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ నెల మధ్యలో నుంచి ప్రారంభం అవుతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
జాగర్ల మూడి క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో హరిహర వీరమల్లును రూపొందిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా నటిస్తోంది. రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో పవర్ స్టార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలో పవన్ ఓ డైలాగ్ కూడా చెప్పాడు. 'ఉన్నతమైన భాష మాట్లాడి.. నీచపు ఆలోచన.. ముతక భాష మాట్లాడి.. ఉన్నతమైన ఆలోచన..' అంటూ మాట్లాడాడు. రైటర్స్ అందరూ ఒకే చోట కూర్చొని డిస్కర్షన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్స్ పవన్ యాక్ట్ చేసి చూపించాడు. నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ నెల మధ్యలో నుంచి ప్రారంభం అవుతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
జాగర్ల మూడి క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో హరిహర వీరమల్లును రూపొందిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా నటిస్తోంది. రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో పవర్ స్టార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.