యాప్నగరం

హరీష్ శంకర్‌తో పవన్ సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ. పవన్ ఫ్యాన్స్‌కు సెప్టెంబర్ 2న సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది.

Samayam Telugu 31 Aug 2020, 7:41 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
Samayam Telugu హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్
Harish Shankar, Pawan Kalyan

కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు.

Also Read: వీడియో: షూటింగ్ షురూ చేసిన సుప్రీం హీరో.. ఇస్మార్ట్ బ్యూటీతో స్టెప్పులు

మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విరుపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తు్న్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను విలన్‌గా తీసుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను పవన్ ప్రారంభించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.