యాప్నగరం

‘ఇంకెన్ని గాయాలు’.. పవన్ పాటలో అనేక ప్రశ్నలు

ఇంకెన్ని గాయాలు? ఇంకెన్ని తూటాలు? ఇంకెన్ని మోసాలు?.. అంటూ దగాపడ్డ జనం గుండె చప్పుడును ‘జనసేన’ గొంతెత్తి పాడుతోంది.

Samayam Telugu 13 Mar 2018, 11:32 pm
ఇంకెన్ని గాయాలు? ఇంకెన్ని తూటాలు? ఇంకెన్ని మోసాలు?.. అంటూ దగాపడ్డ జనం గుండె చప్పుడును ‘జనసేన’ గొంతెత్తి పాడుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు జనసేన థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. జై తెలంగాణా స్లోగన్‌తో మొదలై.. భారత్ మాతా కీ జై అనే పవర్ స్టార్ నినాదంతో ముగిసే ఈ పాటకు యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.
Samayam Telugu pawan kalyan janasena formation day special song released
‘ఇంకెన్ని గాయాలు’.. పవన్ పాటలో అనేక ప్రశ్నలు


జనసేన థీమ్ సాంగ్‌లో స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ, ప్రత్యేక హోదా ఉద్యమ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ ఉద్యమాల ద్వారా మహనీయుల త్యాగాలను గుర్తుచేస్తూనే అమరులైన వీరులను స్మరిస్తుంది. ‘చదువుకుంటా అని పోయాడు శవమై తిరుగొచ్చాడు నా బిడ్డ.. మేం ఎలా బ్రతకాలి సారూ’ అంటూ ఉద్యమాలలో తమ బిడ్డల బిడ్డల ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత వినిపిస్తుంది ఈ పాటలో.

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ ఖాళీ ప్రాంగణంలో మార్చి 14 (రేపు) బుధవారం నాడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్లీనరీ సమావేశానికి లక్షల్లో పవన్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లును కూడా అదే రీతిలో చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.