యాప్నగరం

బాబు.. పెద్దోళ్లకు కాదు, పేదోళ్లకు న్యాయం చెయ్: పవన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మారోసారి ఫైరయ్యారు.

Samayam Telugu 15 May 2018, 6:08 pm
పీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మారోసారి ఫైరయ్యారు. ఈ సారి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే బాబుపై విమర్శలకు దిగారు. చిత్తూరులో రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు కోల్పోయిన బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మంగళవారం పరామర్శించారు.
Samayam Telugu adsa


అనంతరం అనంతరం ఆయన బాధితులతో కలసి దుర్గానగర్ నుంచి గాంధీ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని ప్రజలకే న్యాయం చేయడం లేదు. మిగిలిన జిల్లా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? పేద ప్రజలకు న్యాయం చేయాలి. డబ్బున్న వ్యక్తికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా?. విదేశాల నుంచి వచ్చేవారికి వేల ఎకరాలు ఇస్తున్నారు. సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయాలేరా’’ అని ప్రశ్నించారు.

శ్రీకాళహస్తిలో పవన్: ఇటీవల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న పవన్.. మంగళవారం శ్రీకాళహస్తీర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పవన్‌కు గన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం పవన్‌ గుడిమల్లం పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాల వద్దకు చేరుకున్నారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.