యాప్నగరం

Pink Telugu Remake: పవన్‌ కళ్యాణ్‌ దీక్షలో ఉండగానే ప్రారంభమైన రీ ఎంట్రీ సినిమా!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ పింక్‌ సినిమాను తెలుగులో పవన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది.

Samayam Telugu 12 Dec 2019, 3:41 pm
రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేపోయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. పవన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. పింక్‌ రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.
Samayam Telugu Pawan
ప్రారంభమైన పింక్‌ రీమేక్‌


అయితే గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజునిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రోజు ఈ సినిమా ఎస్వీసీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
Also Read: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి

అయితే ఈ రోజు పవన్‌ కళ్యాన్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొంటున్నాడు. దీంతో పవన్‌ లేకుండానే సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సినిమా కోసం పవన్‌ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్‌ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్‌ ప్లాన్ చేసిన చిత్రయూనిట్‌ ఫిబ్రవరిలో పవన్‌ సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

అమితాబ్‌ బచ్చన్, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిన పింక్‌ సినిమాను తమిళ్‌లో అజిత్ శ్రద్ధా శ్రీనాథ్‌లు లీడ్‌ రోల్స్‌లో రీమేక్‌ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్ లీడ్‌ రోల్‌లో రీమేక్ చేస్తుండగా తాప్సీ, శ్రద్ధా పోషించిన పాత్రలో నివేదా థామస్‌ నటించనుందని తెలుస్తోంది.
Also Read: షాకింగ్‌: బాలయ్య కంటే దర్శకుడి రెమ్యూనరేషనే ఎక్కువా.?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.