పవన్ కళ్యాణ్ టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయా సంస్థల యజమానులను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తున్నాడు. ఈ సందర్భంగా త్వరలో ఓ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశాడు. ‘అరె ఓ సాంబ!! హుకుం సర్దార్!!’ ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుందని ప్రకటించాడు.
శుక్రవారం (ఏప్రిల్ 20న) నుంచి పవన్ మీడియా సంస్థల అధినేతలపై వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు. ముఖ్యంగా టీవీ9 రవి ప్రకాష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలపై కామెంట్స్ చేస్తున్నాడు. వీటిపై ఇరు సంస్థలు పవన్కు లీగల్ నోటీసులు సైతం పంపాయి. అయితే, వాటికి తాను భయపడేది లేదంటూ పవన్ ట్వీట్లదండకం కొనసాగిస్తున్నాడు.
‘‘త్వరలో సరదాగా, కాలక్షేపం కోసం ‘అరె ఓ సాంబ!! హుకుం సర్దార్!!’ ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది. #AreyOsambaHukumSardar కార్యక్రమం సాంబా ప్రపంచం నుంచి కొన్ని సింపుల్ చిట్ చాట్స్, గాసిప్స్, ఫొటోలు, వీడియోలు తదితరాలను అందిచనుంది’’ అని పవన్ ఈ సందర్భంగా తెలిపాడు. దీంతో పవన్ ఏం చెప్పనున్నారా అనే ఆసక్తి నెలకొంది.
శుక్రవారం (ఏప్రిల్ 20న) నుంచి పవన్ మీడియా సంస్థల అధినేతలపై వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు. ముఖ్యంగా టీవీ9 రవి ప్రకాష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలపై కామెంట్స్ చేస్తున్నాడు. వీటిపై ఇరు సంస్థలు పవన్కు లీగల్ నోటీసులు సైతం పంపాయి. అయితే, వాటికి తాను భయపడేది లేదంటూ పవన్ ట్వీట్లదండకం కొనసాగిస్తున్నాడు.
‘‘త్వరలో సరదాగా, కాలక్షేపం కోసం ‘అరె ఓ సాంబ!! హుకుం సర్దార్!!’ ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది. #AreyOsambaHukumSardar కార్యక్రమం సాంబా ప్రపంచం నుంచి కొన్ని సింపుల్ చిట్ చాట్స్, గాసిప్స్, ఫొటోలు, వీడియోలు తదితరాలను అందిచనుంది’’ అని పవన్ ఈ సందర్భంగా తెలిపాడు. దీంతో పవన్ ఏం చెప్పనున్నారా అనే ఆసక్తి నెలకొంది.