యాప్నగరం

ప్రజా యాత్రతో ప్రారంభం కానున్న పవర్ స్టార్ పాలిటిక్స్!

2019 ఎన్నికలను తన ప్రత్యక్ష రాజకీయాలతో హీటెక్కించాలని భావిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రజల మధ్యలోకి...

TNN 9 Oct 2017, 7:54 pm
2019 ఎన్నికలను తన ప్రత్యక్ష రాజకీయాలతో హీటెక్కించాలని భావిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన త్వరలోనే ప్రజా యాత్ర పేరిట పక్కాగా వ్యూహరచన చేస్తున్నారంటున్నాయి జనసేన పార్టీ మీడియా విభాగం వర్గాలు. పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలు, పల్లెటూర్లలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలని తానే స్వయంగా అడిగి తెలుసుకుంటారని తాజాగా జనసేన పార్టీ మీడియా అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
Samayam Telugu pawan kalyan to start his politics with praja yatra
ప్రజా యాత్రతో ప్రారంభం కానున్న పవర్ స్టార్ పాలిటిక్స్!


ప్రస్తుతం పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో బిజీగా వున్నారు. నవంబర్ నెల చివరికల్లా అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత వెంటనే పవన్ ప్రజా యాత్ర ప్రారంభిస్తారని సమాచారం. జనసేన ప్రణాళికల ప్రకారం పవన్ కల్యాణ్ కానీ జనం మధ్యలోకి వస్తే, కచ్చితంగా పవన్ మాటల శైలికి ఇరు రాష్ట్రాల్లో రాజకీయం హీటెక్కే అవకాశాలు బలంగా వున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.