యాప్నగరం

ఒకే వేదికపై పవన్, కేసీఆర్?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. ఎక్కడో తెలుసా?

TNN 12 Sep 2016, 12:46 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించనున్నారా? ఇప్పుడు సినీ, రాజకీయ సర్కిళ్లలో ఇదే హాట్ న్యూస్. వీరిద్దరూ కలవడం ఏంటి అనుకుంటున్నారా? అది రాజకీయ కారణాలతో కాదులేండి. ఓ సినిమా ఆడియో లాంచ్ వేడుక కోసం వీరిద్దరూ ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. ఇంతకూ అది ఏ సినిమా అంటారా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయం అవుతున్న జాగ్వర్ మూవీ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోపాటు సీఎం కేసీఆర్‌లు ముఖ్య అతిథులుగా హాజరవనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌లో ఈ ఆడియో ఫంక్షన్‌ జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి విజయం సాధించిన కేసీఆర్, ప్రత్యేక హోదా కోసం సన్నద్ధమవుతున్న పవన్ ఈ సినిమా ఆడియో కోసం ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. ఇంతకు ముందే కుమారస్వామి వీరిద్దరినీ ఆహ్వానించారు.
Samayam Telugu pawn kalyan and cm kcr will attend the jagwar audio lauch function
ఒకే వేదికపై పవన్, కేసీఆర్?

కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న తన కుమారుడి సినిమా ఆడియో లాంచింగ్‌కు హాజరు కావాలని కోరుతూ.. కుమార స్వామి గతంలో పవన్ కళ్యాణ్‌ని కలిసి కోరారు. గత 8 ఏళ్లుగా తమ మధ్య అనుబంధం వుందని.. పవన్ కళ్యాణ్ తనకి సోదరుడి లాంటి వాడు మాత్రమే కాకుండా తాను సైతం పవన్‌కి వీరాభిమానిని ఆ సందర్భంగా కుమారస్వామి అన్నారు. అక్టోబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో నిఖిల్, దీప్తి జంటగా నటిస్తుండగా.. జగపతి బాబు, సంపత్, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించగా తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.