యాప్నగరం

Jr. Ntr: ఎన్టీఆర్ విషయమై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మీరంతా మూసుకొని ఉండండి అంటూ!!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత నెపోటిజం అంశం సినీ ఇండస్ట్రీలో చర్చల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్‌ని కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ నెటిజన్స్ పెడుతున్న ట్వీట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయింది హీరోయిన్ పాయల్ ఘోష్.

Samayam Telugu 29 Jun 2020, 11:15 am
తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైంది హీరోయిన్ పాయల్ ఘోష్. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో మెరిసింది. ఓ పది సినిమాల్లో నటించినా కూడా టాలీవుడ్‌లో ఈ భామకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
Samayam Telugu ఎన్టీఆర్ విషయమై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మీరంతా మూసుకొని ఉండండి అంటూ!!
Ntr Payal Ghosh


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత నెపోటిజం అంశం సినీ ఇండస్ట్రీలో చర్చల్లో నిలుస్తోంది. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులే ఇండస్ట్రీని ఏలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రా మధ్య వివాదం చెలరేగడం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Also Read: రజినీకాంత్ ఇంట్లో కరోనా టెన్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న సూపర్ స్టార్..!

అయితే ఈ వివాదంలోకి పాయల్ ఘోష్ ఎంటరై.. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే (నట వారసత్వం) అంటూ.. అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ తనకు ట్వీట్స్ పెట్టారని తెలిపింది పాయల్. తాజాగా వీటిపై ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్టీఆర్‌ని తిట్టేవారికి కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదని అనుకుంటున్నా. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు. మీరంతా మూసుకుని ఉండండి అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.