యాప్నగరం

తరుణ్ కాస్త.. గమ్మునుండవోయ్!!

తరుణ్ భాస్కర్ 'పెళ్ళిచూపులు' సినిమా విడుదలైనంత వరకు ఈ పేరు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఆ సినిమా విడుదలయ్యి హిట్ కొట్టడంతో ఇక తరుణ్ భాస్కర్ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు.

TNN 6 May 2017, 6:46 pm
తరుణ్ భాస్కర్ 'పెళ్ళిచూపులు' సినిమా విడుదలైనంత వరకు ఈ పేరు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఆ సినిమా విడుదలయ్యి హిట్ కొట్టడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. ఈ సినిమా నేషనల్ అవార్డ్‌ను సైతం అందుకుంది.
Samayam Telugu pellichoopulu director controversial comments
తరుణ్ కాస్త.. గమ్మునుండవోయ్!!


అయితే ఈ చిత్రానికి 'ఐఫా' వేడుకల్లో ఎలాంటి గౌరవం దక్కకపోవడంతో రీసెంట్‌గా తరుణ్ మాట జారి.. ‘టీఆర్పీ రేటింగ్ కోసం ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాకు అవార్డ్ ఇచ్చారని’ అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.

నిజానికి తరుణ్ భాస్కర్ ఈ వ్యాఖ్యలు కావాలని చేయకపోయినా.. ఇండస్ట్రీలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనేదానికి ఇదొక ఉదాహరణ. అయితే తరుణ్ ఇలా చేయడం తొలిసారి కాదూ పెళ్ళిచూపులు 50 రోజులు పూర్తి చేసుకున్నా సమయంలో కూడా ఆయన తన ఫేస్ బుక్‌లో ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు.

ఈ సినిమా విడుదల కాకుండా ఎంతమంది వెనక్కి లాగారో తక్కువ చేసి ఎవరు మాట్లాడారో చెప్పే ప్రాసెస్‌లో అతడి మాటలు శృతి మించాయనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నే ఈ దర్శకుడు ఆరంభంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమర్ధనీయం అనిపించుకోదు.

ఎన్ని హిట్స్ వచ్చినా పొగరు లేకుండా తగ్గి ఉన్న బడా డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. తరుణ్ అలాంటివారని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన తీసింది మంచి సినిమానే గానీ ఇంకా తన ప్రతిభ ఏంటో తెలిసేది మాత్రం రెండో సినిమాతోనే.. ఈలోగా ఇలాంటి కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కోవడం కష్టాల్ని కొనితెచ్చుకోవడం అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.