యాప్నగరం

భారత్ చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం..

సినీ నటి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆమె పార్థీవదేహం ముంబై ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

TNN 27 Feb 2018, 10:31 pm
సినీ నటి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆమె పార్థీవదేహం ముంబై ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ముంబై ఎయిర్‌పోర్టు దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అనిల్‌కపూర్‌ కుటుంబంతో పాటు అనిల్ అంబానీ, టీనా అంబానీ తదితరులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అభిమానుల భావోద్వేగంతో ముంబై విమానాశ్రయం కన్నీటిసంద్రంగా మారింది.
Samayam Telugu plane with sridevis mortal lands in mumbai
భారత్ చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం..


శ్రీదేవి భౌతికకాయాన్ని నేరుగా ​లోఖండ్‌వాలాలోని గ్రీన్‌ యాకర్స్‌కు తరలిస్తున్నారు. దారి పొడవునా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం (ఫిబ్రవరి 28) ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉంచనున్నారు.

బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇందు కోసం పవన్‌ హాన్స్‌లోని విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.