యాప్నగరం

పరిశీలనలో 'ఎన్టీఆర్‌కి భారత రత్న పురస్కారం' విజ్ఞప్తి

గొప్ప నటుడిగా, ప్రజా నాయకుడిగా, తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి...

TNN 27 May 2017, 4:25 pm
గొప్ప నటుడిగా, ప్రజా నాయకుడిగా, తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావుకి అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించాలనే డిమాండ్ ఇవాళ కొత్తకి కాదు. దాదాపు దశాబ్ధం కాలానికిపైగా వినిపిస్తున్న ఈ డిమాండ్ ఎట్టకేలకి ప్రధాని కార్యాలయానికి చేరింది. 'ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా.. ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి, ఒక కళాకారుడిగా సినీ పరిశ్రమకి చేసిన సేవలని గుర్తిస్తూ ఎన్టీఆర్ గౌరవార్ధం కేంద్రం భారత రత్న ప్రకటించాలి' అని విజ్ఞప్తి చేస్తూ టీడీపీ గతంలోనే ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu pmo will look into conferring bharat ratna to legendary actor ntr kiren rijiju
పరిశీలనలో 'ఎన్టీఆర్‌కి భారత రత్న పురస్కారం' విజ్ఞప్తి


అయితే, తమ పార్టీ చేసిన ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందన కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇటీవల రాసిన లేఖకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజెజు బదులిచ్చారు. ఎన్టీఆర్‌కి భారత రత్న పురస్కారం కోరుతూ అందిన విజ్ఞప్తి దస్త్రం ప్రస్తుతం ప్రధాని కార్యాలయం పరిశీలనలో వుందని, మిగతా వ్యవహారాన్ని పీఎంఓ పరిశీలిస్తుందని కిరెణ్ రిజెజు తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఎప్పటినుంచో పెండింగ్‌లో వున్న తెలుగు ప్రజల విజ్ఞప్తిని ఇకనైనా ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.