Political And Movie Analyst Kathi Mahesh Strong Warning To Pawan Kalyan Again
‘పవన్కి ఈసారి గుండు కాదు.. ఇంట్లోకి దూరి మరీ కొడ్తా’
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. మరోసారి రాయలసీమ వాసుల్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదంటూ తీవ్రపదజాలంతో చెలరేగిపోయారు.
Samayam Telugu28 Nov 2019, 7:14 pm
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. మరోసారి రాయలసీమ వాసుల్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదంటూ తీవ్రపదజాలంతో చెలరేగిపోయారు.
రాజకీయంగా బ్రోకర్.. సామాజికంగా జోకర్
నేను పవన్ కళ్యాణ్పై ఎలాంటి పదజాలం వాడాను. వాళ్ల ఫ్యాన్స్ వాడే పదజాలం వాడానా? మహా అయితే ఒరేయ్.. తురేయ్ అని ఉంటా.. అంతేకదా. రాజకీయంగా బ్రోకర్ అని కాని.. సామాజికంగా జోకర్ అని కాని.. పవన్ కళ్యాణ్ని అన్నానంటే అది విమర్శ మాత్రమే బూతు కాదు.
ఒరేయ్ అంటే నేరమా.. ఎదవ అని అనలేదే!
పవన్ కళ్యాణ్ను నేను పలు సందర్భంల్లో ఒరేయ్ అని ఉంటా.. అందులో ఏముంది? అది పెద్ద నేరమా? నేను గౌరవించే వాళ్లను గారు అనడం.. గౌరవించకపోతే ఎదవ అనడం నా అవవాటు. నేను పవన్ కళ్యాణ్ను ఎదవ అని కూడా అనలేదు. ఒరేయ్ పవన్ కళ్యాణ్ అని రాసి ఉంటా. అది తప్పు అని నేను అనుకోవడం లేదు.
తెలుగుదేశానికి బానిస కుక్క.. కాదని నిరూపించమనండి
నేను పవన్ కళ్యాణ్ను బానిస కుక్క అన్నది నిజం. ఆ మాటకు కట్టుబడి ఉంటా. అతను తెలుగుదేశానికి బానిస కుక్క.. కాదని నిరూపించమనండి. దత్తపుత్రుడు అనే గొప్ప పదాన్ని నేను వాడాలని అనుకోవడం లేదు. నేను ఎప్పుడు ఘాటు పదాలను వాడానంటే.. అతను రాయల సీమ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు.
నేను రాయల సీమకు చెందిన వాడిని. చాలా ఏళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. నీటి విషయంలో కాని.. రాజధాని విషయంలో కాని మాకు అన్యాయం జరిగింది. వీటి గురించి మాట్లాడకుండా.. జగన్ రాయలసీమ వాసి కాబట్టి.. కర్నూల్లో కోర్టుపెట్టుకోమనండి.. ఇడుపుల పాయలో రాజధానిని పెట్టుకోమనండి అంటూ సీమవాసుల్ని అవనించేలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది.
మొదట కర్నూల్ రాజధాని అంటాడు.. మళ్లీ అమరావతి అంటాడు..
కర్నూల్కి వచ్చినప్పుడేమో నా మనసులో రాజధాని కర్నూల్ అంటాడు.. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు కాబట్టి అక్కడకు వెళ్లినప్పుడు అమరావతే రాజధాని అంటాడు. రాయలసీమ వాసుల్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడితే.. మేం సైలెంట్గా ఉండము అని అతనికి కమ్యునికేట్ చేయడానికి ఘాటైన పదాలు వాడాను.
నాపై కోడిగుడ్లతో దాడి చేసినోళ్లతో పవన్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ను తిట్టడం నా పర్శనల్ అజెండా కాదు. నేను పర్శనల్ అజెండాగా భావిస్తే ఎప్పుడో తిట్టాల్సినోడినే. ఎప్పుడైతే నా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోడిగుడ్లు దాడి చేశారో.. వాళ్లను ఆయన ఆఫీస్కు పిలిపించుకుని అభినందించి వాళ్లతో కలిసి ఫోటోలు దిగినప్పుడే నేను పర్శనల్గా తీసుకోలేదు. దాన్ని నేను అతని మూర్ఖత్వం గానూ.. దిగజారుడుతనానికి నిదర్శనంగానూ తీసుకున్నాను. ఒక వ్యక్తిగా అతను గౌరవించదగిన వాడు కాదని అనుకున్నా. అంతేతప్ప కక్ష సాధింపు కాదు.
చంద్రబాబు కావొచ్చు జగన్ కావొచ్చు పవన్ కావొచ్చు.. రాయలసీమ వాసుల్ని కించపరిచేలా మాట్లాడితే.. నేను ఇలాగే స్పందిస్తా. మా రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లుతామంటే నేను అదే స్థాయిలో స్పందిస్తా. నా పదజాలం కూడా మారుతుంది. దీన్ని నేను ధర్మాగ్రహం అని భావిస్తా.
పవన్ కళ్యాణ్కి మరోసారి గుండు గీయడమే కాదు.. ఈసారి ఇంటిలోకి దూరి మరీ కొడ్తా
మరోమారు రాయలసీమ విషయంలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే.. గుండు గీయడమే కాదు.. నేను అతని ఇంటిలోకి దూరి మరీ కొడతానేమో. నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి గట్టి వార్నింగ్ ఇస్తున్నా. సీమ అంటే మా భూమి.. అక్కడ ప్రజలు మా వాళ్లు. సీమ గురించి గాని దళితులు గురించిగాని చీప్గా మాట్లాడితే తగిన సమాధానం చెప్తాం. మేం రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటాం కాని.. మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడితే మాకూ మనోభావాలు ఉంటాయని ఆయన మరిచిపోకూడదు’ అంటూ పవన్ కళ్యాణ్పై చిందులు తొక్కారు కత్తి మహేష్.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.