దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్గా తనదైన గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ ఏడాది ఆమె కెరీర్లో మరచిపోలేని ఏడాదిగా చెప్పుకోవచ్చు. ఎందుంకటే సినిమాలకు సంబంధించిన జయాపజయాలనే విషయాలను పక్కన పెడితే, తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ రెడ్ కార్పెట్పై నడిచే అవకాశం దక్కింది. రీసెంట్గా పూజా హెగ్డే తెల్లటి అందమైన గౌనులో రెడ్ కార్పెట్పై చిరునవ్వులొలికిస్తూ అందంగా నడిచేసింది. ఇదంతా బాగానే ఉంది. అయితే పూజా హెగ్డేకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ చేదు అనుభవం ఎదురైంది. దాని కారణంగా ఆమె టెన్షన్ పడింది.
అసలు ఇంతకీ పూజా హెగ్డే ఎందుకు టెన్షన్ పడిందనే వివరాల్లోకి వెళితే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పూజా హెగ్డే తీసుకు వచ్చిన మేకప్ కిట్, డ్రెస్ ఉన్న లగేజ్ అంతా మిస్ అయ్యింది. హెయిర్ స్టైలిష్ ఫుడ్ పాయిజనింగ్కు గురి కావటంతో పాటు విమానాశ్రయం నుంచి రావాల్సిన బ్యాగులలో ఒకటి మాత్రమే పూజా హెగ్డే దగ్గర చేరింది. దీంట్లో విలువైన అభరణాలున్నాయి. కానీ డ్రెస్ ఇతర మేకప్ కిట్ మిస్ అయ్యింది. ఫెస్టివల్కు కొన్ని గంటల ముందే ఇది జరగటంతో బుట్టబొమ్మ చాలా టెన్షన్ పడింది. ఆమెతో పాటు ఆమె టీమ్ కూడా ఆందోళనకు లోనైంది. అయితే వెంటనే వారు నిద్రాహారాలు మానుకుని పూజా హెగ్డేకు సహాయం చేయాలని పనిచేశారు. దాంతో పూజా హెగ్డే రెడ్ కార్పెట్పై నడవగలిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బాలీవుడ్ చిత్రాలు, తెలుగులో మహేష్ సినిమా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ మూవీలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్గా నటిస్తోంది.
అసలు ఇంతకీ పూజా హెగ్డే ఎందుకు టెన్షన్ పడిందనే వివరాల్లోకి వెళితే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పూజా హెగ్డే తీసుకు వచ్చిన మేకప్ కిట్, డ్రెస్ ఉన్న లగేజ్ అంతా మిస్ అయ్యింది. హెయిర్ స్టైలిష్ ఫుడ్ పాయిజనింగ్కు గురి కావటంతో పాటు విమానాశ్రయం నుంచి రావాల్సిన బ్యాగులలో ఒకటి మాత్రమే పూజా హెగ్డే దగ్గర చేరింది. దీంట్లో విలువైన అభరణాలున్నాయి. కానీ డ్రెస్ ఇతర మేకప్ కిట్ మిస్ అయ్యింది. ఫెస్టివల్కు కొన్ని గంటల ముందే ఇది జరగటంతో బుట్టబొమ్మ చాలా టెన్షన్ పడింది. ఆమెతో పాటు ఆమె టీమ్ కూడా ఆందోళనకు లోనైంది. అయితే వెంటనే వారు నిద్రాహారాలు మానుకుని పూజా హెగ్డేకు సహాయం చేయాలని పనిచేశారు. దాంతో పూజా హెగ్డే రెడ్ కార్పెట్పై నడవగలిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బాలీవుడ్ చిత్రాలు, తెలుగులో మహేష్ సినిమా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ మూవీలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్గా నటిస్తోంది.