యాప్నగరం

పూజా హెగ్డేకు దిల్ రాజు మరో అవకాశం?

నితిన్‌ను హీరోగా పెట్టి దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజుకు ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

TNN 5 Jan 2018, 11:52 am
నితిన్‌ను హీరోగా పెట్టి దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజుకు ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి నుంచి ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైంది. తొలుత అనుపమా పరమేశ్వరన్, సమంత పేర్లు వినిపించాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ గాని, ఆ హీరోయిన్లు కానీ స్పందించలేదు.
Samayam Telugu pooja hegde to team up with nithiin for srinivasa kalyanam
పూజా హెగ్డేకు దిల్ రాజు మరో అవకాశం?


ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్‌తో ఆడిపాడిన పూజా హెగ్డేను ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లు టాక్. దిల్ రాజు ఆఫర్‌ను ఇప్పటికే పూజా ఓకే చేసేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న మహేష్ బాబు 25వ సినిమాలో కూడా పూజాహెగ్డేను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా దిల్ రాజే నిర్మాత. దీంతో నితిన్ పక్కన కూడా పూజా అయితే బాగుంటుందని బావించి దిల్ రాజు ఆమెనే ఓకే చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్‌లో పూజా బిజీగా ఉంది. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరవాత మార్చిలో ప్రారంభమయ్యే ‘శ్రీనివాస కళ్యాణం’ షెడ్యూల్‌లో పూజా పాల్గొంటుందని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో 14 ఏళ్ల తరవాత నితిన్ మళ్లీ సినిమా చేస్తుండటం విశేషం. వాస్తవానికి ఈ సినిమా కోసం తొలుత రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు వినిపించినా చివరకు నితిన్‌ హీరోగా ఖరారయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.