యాప్నగరం

ఇండస్ట్రీలో ఇలాంటి వెధవలుంటారా..: పోసాని ఫైర్

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు.

TNN 10 Sep 2017, 3:54 pm
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో మానవత్వం అనేది లేదని, ఇంకా వెన్నుపోట్లు కొనసాగుతున్నాయన్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘ఉంగరాల రాంబాబు’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu posani krishna murali speech in ungarala rambabu pre release event
ఇండస్ట్రీలో ఇలాంటి వెధవలుంటారా..: పోసాని ఫైర్


వేదికపై ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్ ప్రదర్శించిన అనంతరం పోసాని మైక్ తీసుకున్నారు. ట్రైలర్‌లో సునీల్ చెప్పిన ‘దేశం వెనకబడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు మనలో మానవత్వం లేకపోవడం’ అనే డైలాగునుద్దేశించి పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు, తన తోటి నటుడు అలీకి జరిగిన అన్యాయం గురించి ఉద్వేగభరితంగా మాట్లాడారు.

‘మానవత్వం లేదు అనేది వాస్తవం. నేను, అలీ ఈ మధ్యే కలిశాం. అలీ నాకు 32 ఏళ్లుగా తెలుసు. మచ్చలేని వ్యక్తి అలీ. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. మురళి.. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది. దానిలో నువ్వు, నేను ప్రధాన పాత్రదారులం. కానీ ఒకడొచ్చి నీ పేరు, నాపేరు పక్కన పడేసి.. వీళ్లెందుకు ఎక్కువ డబ్బులు అడుగుతారు, వాడైతే తక్కువకొస్తాడు అని మన ఇద్దరిని పక్కకు నెట్టి వేరే వాళ్లను అందులో యాక్ట్ చేయించి సినిమాను విడుదల చేశారు అని చెప్పాడు. ఇన్నాళ్ల తరవాత, ఇంత జీవితం చూసిన తరవాత కూడా ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా? ఇంకా మోసాలు ఉంటాయా? ఇంకా ఇలాంటి వెధవులు ఉంటారా ఇండస్ట్రీలో అనిపిస్తోంది’ అని పోసాని ఉగ్వేదభరితంగా మాట్లాడారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే గుండెపగిలిపోయేంత బాధ కలుగుతుందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.