యాప్నగరం

Pink Remake: నిర్మాతలపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్?

నిర్మాత దిల్ రాజుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారట. వీరిద్దరి కాంబినేషన్‌లో పింక్ రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ సెట్స్‌లో తిరుగుతున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

Samayam Telugu 22 Jan 2020, 4:20 pm
చాలా కాలం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చక్కటి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’ సినిమా రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ కపూర్‌లపై పవన్ ఆగ్రహం వ్యకం చేశారట. ఎందుకంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా మొదలుపెట్టేశారు.
Samayam Telugu pawan kalyan
పవన్ కళ్యాణ్


సెట్స్‌లో బ్లాక్ దుస్తుల్లో పవన్ నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. నిన్న తొలి షెడ్యూల్ పూర్తవడంతో పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే సెట్స్‌లోని ఫొటోలు లీక్ అవడంపై పవన్ ఫైర్ అయ్యారట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందుకు నిర్మాతలపై మండిపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో సెట్స్‌లో భారీ సెక్యూరిటీని విధించినట్లు తెలుస్తోంది. ‘పింక్’ సినిమాను ఇప్పటికే నిర్మాత బోనీ కపూర్ తమిళంలో రీమేక్ చేశారు. అజిత్ లాయర్ పాత్ర పోషించిన ఈ సినిమాను ‘నేర్కొండ పార్వాయి’గా తమిళంలో తెరకెక్కించారు. అజిత్ కూడా ఈ సినిమాలో గుబురు గెడ్బంతో కనిపించారు.

READ ALSO: 120 కోట్ల పారితోషికమా.. ఇది టూ మచ్ భయ్యా!

అయితే, తెలుగులో ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ టైటిల్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. బోనీ కపూర్‌తో కలిసి ఈ సినిమాను దిల్ రాజు తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

See Photo Story: వావ్ రాయ్ లక్ష్మీ వర్కవుట్ పిక్స్... అదుర్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.