యాప్నగరం

పోస్టర్ పడింది: ‘రంగస్థలం’ విజయోత్సవ సభకు పవన్

మెగా అభిమానులు సమ్మర్‌లో అసలు సిసలు పండగ వాతావరణాన్ని చూడబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లను చాలా రోజుల తరువాత ఒకే వేదికపై చూడబోతున్నారు.

Samayam Telugu 12 Apr 2018, 8:14 pm
మెగా అభిమానులు సమ్మర్‌లో అసలు సిసలు పండగ వాతావరణాన్ని చూడబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లను చాలా రోజుల తరువాత ఒకే వేదికపై చూడబోతున్నారు. కన్నులవిందు లాంటి దృశ్యాన్ని చూసేందుకు డేట్, టైమ్‌తో కూడిన మెగా పోస్టర్ కూడా అఫీసియల్‌గా వచ్చేసింది.
Samayam Telugu రంగస్థలం విజయోత్సవం


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీ మార్చి 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసింది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. కాగా ఈమూవీలో చిట్టిబాబు‌గా రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. రికార్డ్ కలెక్షన్ల‌తో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న ఈ మూవీని ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించి చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
కాగా 2018 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘రంగస్థలం’ మూవీ విజయోత్సవేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు నిర్మాతలు. శుక్రవారం సాయంత్రం (రేపు) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ప్రారంభంకానున్న ఈ మెగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ‘రంగస్థలం’ నటీనటులు రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ మెగా ఈవెంట్‌కు హాజరుకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.