యాప్నగరం

ప్రభాస్, చరణ్‌ల కొత్త బిజినెస్ ప్లాన్!

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు.

TNN 14 Dec 2017, 3:31 pm
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కొత్త బిజినెస్ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా ప్రభాస్, రామ్ చరణ్‌లు కలిసి వ్యాపారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్‌కు ఎప్పటినుండో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాలనే కోరిక. ఈ మేరకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఓ స్థలం కూడా కొని ఉంచారు.
Samayam Telugu prabhas and ram charan entered into new business
ప్రభాస్, చరణ్‌ల కొత్త బిజినెస్ ప్లాన్!


అయితే రామ్ చరణ్‌తో కలిసి ఈ వ్యాపారం చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఇద్దరూ కలిసి ఓ జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్‌ను లీజ్‌కు తీసుకొని వ్యాపారం చేస్తున్నారట. ఇదంతా కూడా యువి క్రియేషన్స్ అలానే కొణిదల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెబుతున్నారు. చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమా నైజాం హక్కులను యువి క్రియేషన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి పెద్ద ప్లానే వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.