యాప్నగరం

Gopichand: పక్కా కమర్షియల్‌ మూవీకి ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్

గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆకాంక్షించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 30 Jun 2022, 10:37 pm
Samayam Telugu పక్కా కమర్షియల్ మూవీకి ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్
మ్యాచో స్టార్ గోపీచంద్, బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా జంటగా నటించిన మూవీ 'పక్కా కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. జులై 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించడంతో పాటు.. పోస్టర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ మూవీతో అయినా మ్యాచో స్టార్ హిట్ ట్రాక్ ఎక్కుతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు.

రేపు (శుక్రవారం) విడుదల కానున్న 'పక్కా కమర్షియల్' సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సపోర్ట్‌గా నిలిచారు. మూవీ టీమ్ శుభాకాంక్షలు చెబుతూ.. మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రభాస్, సాయిధరమ్ తేజ్‌కు డైరెక్టర్ మారుతి ధన్యవాదాలు చెబుతూ రీ ట్వీట్ చేశాడు.

కాగా ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్లు ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క, రెస్టాఫ్ ఇండియా క‌లుపుకుని 50 ల‌క్షల రూపాయలు, ఓవ‌ర్ సీస్ రూ.1.20 కోట్లు బిజినెస్ జ‌రిగినట్లు సమాచారం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా రూ.19.20 కోట్లు ముందస్తు బిజినెస్ జరుపుకున్నట్లు తెలిసింది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.20 కోట్ల మేర వసూళ్లను రాబట్టాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.