యాప్నగరం

హైదరాబాద్ వరద బాధితులకు ప్రభాస్ సాయం.. రూ. 1.5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి యావత్తు టాలీవుడ్ ముందుకొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్లంతా విరాళాలు అందజేశారు.

Samayam Telugu 21 Oct 2020, 2:11 pm
భారీ వర్షాలు, వరదలు తెలంగాణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇప్పటికీ వర్షం ఆగకుండా కురుస్తుండటంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. ఈ భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. ఈ విపత్తు కోలుకోవడానికి హైదరాబాద్ నగరానికి చాలా సమయమే పడుతుంది.
Samayam Telugu ప్రభాస్
Prabhas


అయితే భారీ వర్షాలు, వరదలు కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొనేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమ సాయాన్ని ప్రకటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, ఎన్టీఆర్ రూ.50 లక్షలు, నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, రవితేజ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా రూ. 10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షలు వరద బాధితుల సాయంగా ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కోటి 50 లక్షల రూపాయల విరాళాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్టు ప్రకటించారు.


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.