యాప్నగరం

చిట్టి అభిమాని కోరిక తీర్చిన ప్రభాస్..!

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనని కలవాలని కోరుకున్న చిట్టి అభిమాని మదన్ రెడ్డి కోరికను యంగ్ రెబల్ స్టార్

Samayam Telugu 13 Aug 2018, 8:41 pm
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనని కలవాలని కోరుకున్న చిట్టి అభిమాని మదన్ రెడ్డి కోరికను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెరవేర్చాడు. ఇటీవల ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ‘ఐ వాంట్ టు మీట్ బాహుబలి’ అనే ఫ్లకార్డ్ చేతబట్టుకున్న బాలుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu 700


ఆ ఫొటో చక్కర్లు కొడుతూ.. ప్రభాస్ కంటపడగా.. తాజాగా ఆ బాలుడి కోరికను యంగ్ రెబల్ ‌స్టార్ నెరవేర్చాడు. చిట్టి అభిమానితో కలిసి కాసేపు సరదాగా గడిపిన ప్రభాస్.. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోల్ని ప్రస్తుతం అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘బాహుబలి 2’ తర్వాత కొద్దిగా విరామం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అతని సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.