‘సాహో’తో మరోసారి ఇండియన్ మూవీ లవర్స్ని ఆకట్టుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన సొంత బ్యానర్లో త్రిభాషా చిత్రం చేస్తున్నారు. సీనియర్ నటుడు, నిర్మాత, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్పై ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘జిల్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించిన కె.కె. రాధాకృష్ణ దర్శకుడు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో మరో భారీ షెడ్యూల్ను ప్రారంభిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో జరిగే షెడ్యూల్లో ప్రభాస్తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. రేపు (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Also Read: బన్నీని ఆ పిల్ల ఆగం చేసిందట.. ఏంది ‘రాములా’ ఇది!
కాగా.. ‘బిల్లా’ తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించనున్నారు. సాంకేతికంగా అత్యుత్తమ నాణ్యతతో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస.. ప్రొడక్షన్ డిజైనింగ్లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్.. తనదైన షార్ప్ ఎడిటింగ్తో ఎన్నో అద్భుతమైన హిట్స్లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో మరో భారీ షెడ్యూల్ను ప్రారంభిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో జరిగే షెడ్యూల్లో ప్రభాస్తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. రేపు (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Also Read: బన్నీని ఆ పిల్ల ఆగం చేసిందట.. ఏంది ‘రాములా’ ఇది!
కాగా.. ‘బిల్లా’ తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించనున్నారు. సాంకేతికంగా అత్యుత్తమ నాణ్యతతో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస.. ప్రొడక్షన్ డిజైనింగ్లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్.. తనదైన షార్ప్ ఎడిటింగ్తో ఎన్నో అద్భుతమైన హిట్స్లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.