‘సాహో’ ప్రచారంలో భాగంగా ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని ప్రభాస్ ఆకాంక్షించారు. అయితే, జగన్కు అనుకూలంగా ప్రభాస్ మాట్లాడటంతో టీడీపీ ఫ్యాన్స్ ‘సాహో’ సినిమాపై విశప్రచారం చేస్తున్నారని ఓ వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి కుల విభేదాలు సృష్టిస్తూ తప్పుడు వార్తలు రాయడం ద్వారా సంపాదిస్తోన్న డబ్బు ఎలా మింగుడుపడుతోందంటూ లోకేష్ ఘాటు ట్వీటు చేశారు. దీంతో ‘సాహో’-టీడీపీ వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదం నేషనల్ మీడియాను కూడా బాగా ఆకర్షించింది.
Also Read:
ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధా కపూర్ ‘సాహో’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘ఇ-టైమ్స్’ వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా టీడీపీ వివాదంపై ప్రశ్న సంధించింది. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ.. ‘‘తానేమీ తప్పుగా మాట్లాడలేదని, జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకెళ్లాలని మాత్రమే చెప్పానని, అసలు అది వివాదం ఎందుకయ్యిందో అర్థం కావడంలేదని’’ అన్నారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా మీకు ఉందా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘మా పెదనాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు 70 ఏళ్ల వయసులో ఆయన గ్రామాలకు వెళ్లి సేవ చేశారు. మేం కూడా వెళ్లేవాళ్లం. కానీ, నాకు రాజకీయాలు సరిపోవు. అక్కడ బోలెడన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాటన్నిటినీ మేనేజ్ చేయడం నా వల్లకాదు’’ అని ప్రభాస్ సమాధానం చెప్పారు.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి కుల విభేదాలు సృష్టిస్తూ తప్పుడు వార్తలు రాయడం ద్వారా సంపాదిస్తోన్న డబ్బు ఎలా మింగుడుపడుతోందంటూ లోకేష్ ఘాటు ట్వీటు చేశారు. దీంతో ‘సాహో’-టీడీపీ వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదం నేషనల్ మీడియాను కూడా బాగా ఆకర్షించింది.
Also Read:
కారు రాజ్ తరుణ్దే.. రిజిస్ట్రేషన్ ఓ కంపెనీ పేరిట ఎందుకు?
కారు రాజ్ తరుణ్దే.. రిజిస్ట్రేషన్ ఓ కంపెనీ పేరిట ఎందుకు?
కారు రాజ్ తరుణ్దే.. రిజిస్ట్రేషన్ ఓ కంపెనీ పేరిట ఎందుకు?ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధా కపూర్ ‘సాహో’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘ఇ-టైమ్స్’ వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా టీడీపీ వివాదంపై ప్రశ్న సంధించింది. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ.. ‘‘తానేమీ తప్పుగా మాట్లాడలేదని, జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకెళ్లాలని మాత్రమే చెప్పానని, అసలు అది వివాదం ఎందుకయ్యిందో అర్థం కావడంలేదని’’ అన్నారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా మీకు ఉందా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘మా పెదనాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు 70 ఏళ్ల వయసులో ఆయన గ్రామాలకు వెళ్లి సేవ చేశారు. మేం కూడా వెళ్లేవాళ్లం. కానీ, నాకు రాజకీయాలు సరిపోవు. అక్కడ బోలెడన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాటన్నిటినీ మేనేజ్ చేయడం నా వల్లకాదు’’ అని ప్రభాస్ సమాధానం చెప్పారు.