యాప్నగరం

Green India Challenge: గొప్ప హామీ ఇచ్చిన ప్రభాస్.. రామ్ చరణ్, రానాలను నామినేట్ చేస్తూ!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశ ప్రారంభించిన ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. ఈ మేరకు గొప్ప హామీ ఇస్తూ రామ్ చరణ్, రానాలను నామినేట్ చేశారు.

Samayam Telugu 11 Jun 2020, 9:20 pm
పర్యావరణ హితం కోరుకుంటూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీకరించారు. ఈ మేరకు తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు.
Samayam Telugu ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
Prabhas Green India Challenge


ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడినదని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్యక్రమం తనను ఇన్‌స్పైర్ చేసిందని ప్రభాస్ పేర్కొన్నారు. అందుకే వారి స్పూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

Also Read: ఎప్పుడూ చిట్టిపొట్టి బట్టలేసే రకుల్.. ఈ సారి! ఎయిర్‌పోర్ట్‌లో అలా కెమెరాకు చిక్కడంతో.. వైరల్ పిక్స్

''సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నా'' అని ప్రభాస్ తెలిపారు.

అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ''యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకం. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతులమీదగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.