యాప్నగరం

బాలీవుడ్‌‌కి దేవకట్టా ‘ప్రస్థానం’మూవీ

తొమ్మిదేళ్ల క్రితం టాలీవుడ్‌లో వచ్చిన చిత్రం 'ప్రస్థానం' అప్పట్లో సన్సేషన్ క్రియేట్ చేసింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

TNN 19 Dec 2016, 9:13 pm
తొమ్మిదేళ్ల క్రితం టాలీవుడ్‌లో వచ్చిన చిత్రం 'ప్రస్థానం' అప్పట్లో సన్సేషన్ క్రియేట్ చేసింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమాతోనే యంగ్ హీరో శర్వానంద్ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రస్థానం సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
Samayam Telugu prasthanam will be remade in bllywood
బాలీవుడ్‌‌కి దేవకట్టా ‘ప్రస్థానం’మూవీ


తెలుగులో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా బాలీవుడ్‌కు వెళ్లబోతోంది. దర్శకుడు దేవాకట్టా ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ పోషించిన పాత్రను హిందీలో నానా పటేకర్ చేయనున్నారని తెలుస్తోంది. శర్వానంద్, సందీప్ కిషన్‌ల పాత్రల ఎంపిక కోసం కోసం సెలక్షన్స్ మొదలు పెట్టాడట దేవకట్టా.

ప్రస్థానం సినిమా వచ్చి ఎన్నేళ్లు దాటుతున్నా.. ఆ కథలో కొత్తదనం వలన ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కించే ధైర్యం చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో రీమేక్ చేయడానికి అప్పట్లో బానే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్ర వ్యవహారాలు చూసుకోబోతున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.