యాప్నగరం

ప్రీతీ జింతా లైంగిక వేదింపుల కేసు కొట్టివేత

నాలుగేళ్ల నాటి వివాదానికి హైకోర్టు పుల్‌స్టాప్ పెట్టేసింది. ఆ కేసును బయటే పరిష్కరించుకోవాలని సూచించింది.

Samayam Telugu 10 Oct 2018, 10:11 pm
పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై హీరోయిన్ ప్రీతీ జింతా చేసిన లైంగిక ఆరోపణల కేసును హైకోర్టు కొట్టేసింది. కోర్టు ఇది వరకే ఈ కేసును పరిష్కరించుకోవాలని ప్రీతికి చెప్పింది. అయితే, వాడియా క్షమాపణలు చెబితేనే సమస్యను పరిష్కరించుకోడానికి ప్రీతి సిద్ధంగా ఉందని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు వెల్లడించారు. ఇందుకు వాడియా లాయర్లు అంగీకరించలేదు.
Samayam Telugu bdf5f1cf5ad64a279ad0d1ec80582a53


‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్’ యజమానులుగా ఉన్న వీరిద్దరూ 2014, మే 30న స్టేడియంలో టీ-20 మ్యాచ్‌ సీట్ల కేటాయింపుపై వాగ్వాదం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాడియా ఆమెతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు తన భుజాన్ని పట్టుకున్ని లైంగికంగా వేదించాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన బోంబే హైకోర్టు ఈ సమస్యను బయట పరిష్కరించుకోవాలని సూచిస్తూ కేసు కొట్టేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.