యాప్నగరం

ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన నిర్మాత అశ్వనీదత్.. రూ.210 కోట్లు చెల్లించాలంటూ

భూ సమీకరణ విషయంలో సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజధాని కోసం తన నుంచి సేకరించిన 39 ఎకరాలకు భూసేకరణ చట్టం కింద నాలుగు రెట్లు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

Samayam Telugu 28 Sep 2020, 10:53 pm
అమరావతిలో జరిగిన భూ సమీకరణ అంశంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు.
Samayam Telugu Image


Also Read: హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు.. చెన్నైలో కలకలం

అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్ తెలిపారు. తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.

Also Read: డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లకు షాక్... అప్పటివరకు జైల్లోనే

ప్రస్తుతం తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని, భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వనీదత్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

Also Read: హైదరాబాద్‌ వచ్చే సిన రకుల్‌... ఆ కేసు నుంచి సేఫ్ అయినట్లేనా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.