యాప్నగరం

Virupaksha: ‘విరూపాక్ష’కు A సర్టిఫికెట్.. మగధీరకే తప్పలేదన్న ప్రొడ్యూసర్.. కంటెంట్‌పై కామెంట్స్

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ శుక్రవారం విడుదలవనుంది. అయితే సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేయడంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

Authored bySanthosh Damera | Samayam Telugu 20 Apr 2023, 10:54 pm

ప్రధానాంశాలు:

  • విరూపాక్ష మూవీకి A సర్టిఫికెట్
  • కంటెంట్‌పై జర్నలిస్టు ప్రశ్నలు
  • కౌంటర్ ఇచ్చిన ప్రొడ్యూసర్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej).. మొట్టమొదటిసారి మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మించగా.. కార్తిక్ వర్మ (Karthik Varma) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) ఫిమేల్ లీడ్‌గా నటించిన ‘విరూపాక్ష’ శుక్రవారం (ఏప్రిల్ 21) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, సాయిధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్లు సంయుక్త, సోనియా సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే A సర్టిఫికెట్ (A Certificate) రావడం వెనకున్న కారణం గురించి ప్రశ్నించారు.
లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం వల్లే సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిందా? అని జర్నలిస్టు అడిగారు. దీనికి సమాధానమిచ్చిన సాయిధరమ్ తేజ్.. సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవని, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చని చెప్పారు. ఇక ఈ ప్రశ్నకు డైరెక్టర్ కార్తిక్ పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలో ఒళ్లు జలదరించే సన్నివేశాలు ఉంటాయని.. అందుకే సెన్సార్‌ బోర్డ్‌ A సర్టిఫికెట్‌ ఇచ్చిందని వెల్లడించాడు.

అయితే ఈ క్రమంలోనే కల్పించుకున్న నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. మగధీర (Magadhira) చిత్రానికి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని.. మరి ఆ చిత్రంలో రొమాంటిక్ కంటెంట్ ఉందా? అని కౌంటర్ ఇచ్చారు. ఇదొక థ్రిల్లర్ అని, యాక్షన్ బ్లాక్స్ ఉండటం వల్లే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. అంతేకాదు మీరనుకునే కంటెంట్ అయితే ఇందులో లేదంటూ సాయిధరమ్ తేజ్ మరోసారి సదరు జర్నలిస్టును ఆటపట్టించారు.

ఇక ‘విరూపాక్ష’ స్టోరీ విషయానికొస్తే.. ఒక ఊర్లో వరుసగా సంభవించే మరణాలకు చేతబడి కారణమా? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? అని తెలుసుకునేందుకు హీరో చేసే పోరాటం నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ఇలాంటి జోనర్‌లో సాయిధరమ్ తేజ్‌కు మొదటి సినిమా. కాగా.. ఈ కథకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.