యాప్నగరం

అక్కడ మెయిన్ సెంటర్‌లో థియేటర్ అమ్మేసిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు..?

విశాఖపట్నంలో మెయిన్ సెంటర్‌లో ఉన్న జ్యోతి థియేటర్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జనాలకు థియేటర్స్‌కు రాకపోవడంతో బాక్సాఫీసు కాసుల పెట్టె వెలవెలబోతున్న సంగతి తెలిసిందే.

Authored byAshok Krindinti | Samayam Telugu 30 Aug 2022, 10:37 pm
జనాలు ఓటీటీలకు అలవాటు పడడంతో థియేటర్స్‌కు రావడం లేదని ఇటీవల కొందరు సినీ పెద్దలు అంటున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మూవీ లవర్స్ ఓటీటీలకు అలవాటు పడినా.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రాకపోవడంతో థియేటర్స్ వైపు చూడడం తగ్గించేశారు. అదేవిధంగా టికెట్ ధరలు కూడా భారీగా పెంచేయడంతో అంత ఖర్చు చేసేందుకు ప్రేక్షకులు వెనడుగు వేస్తున్నారు. ఆడియన్స్ రాకపోవడంతో సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితులు ఉంటున్నాయని పలువురు నిర్మాతలు వాపోతున్నారు.
Samayam Telugu producer suresh babu
దగ్గుబాటి సురేష్ బాబు


ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన సురేష్ బాబు (Suresh Babu) ఓ థియేటర్ అమ్మేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్‌ను ఆయన అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయనగరానికి చెందిన వ్యాపారులు ఈ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్‌ను కూల్చివేసి.. ఆ స్థానంలో పది అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆ వ్యాపారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆఫీస్ స్పెస్, దుకాణాలు ఉండేలా కాంప్లెక్స్ డిజైన్ చేయబోతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

విశాఖలో టాప్‌ థియేటర్స్‌లో ఒకటైన జ్యోతి థియేటర్‌ను అమ్మేయడం టాలీవుడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఎన్నో ఏళ్లుగా డిస్టిబ్యూటర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఉన్న సురేష్ బాబు ఓ థియేటర్‌ను అమ్మేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటూ సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ రేట్లతో థియేటర్స్ నడపడం కంటే అమ్మేయడమే నయమని కూడా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.