సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా మారుతున్నారని నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారని కూడా అన్నారు. ఇది రూమర్గా మిగిలిపోతుందేమో అని చాలా మంది అనుకునే ఉంటారు. కానీ, ఈ రూమర్ను నిజం చేస్తూ వి.వి.వినాయక్తో దిల్ రాజు సినిమాను ప్రకటించేశారు. తిరుమల ఏడు కొండల వెంకటేశ్వరుడి సాక్షిగా వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.
‘మహేష్ బాబు గారి 25వ సినిమా ‘మహర్షి’ విడుదల చేసి 5 రోజులు పూర్తయింది. మహేష్ బాబు కెరీర్లోని మంచి సినిమాల్లో ఇదీ ఒకటి. ఆల్ టైమ్ రికార్డ్ సినిమా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కేవలం కమర్షియల్ హిట్టే కాకుండా ఆ సినిమా ద్వారా రైతుల గురించి ప్రస్తావించి అందరిలో ఒక ఆలోచన వచ్చేలా చేశారు మా వంశీ, హరి టీమ్. ఇంత పెద్ద విజయాన్ని అందించిన స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాం’ అని దిల్ రాజు వెల్లడించారు.
ఇక వి.వి.వినాయక్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘దిల్’ సినిమాతో మొదలై 16 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. నా నామకరణం కూడా ‘దిల్’ రాజు అయిపోయింది. ఈ మధ్య ఒక స్క్రిప్ట్ విన్నాను. ఆ స్క్రిప్ట్కి ఎవరైతే బాగుంటారు అని ఆలోచిస్తుంటే రెండు రోజుల క్రితం వి.వి.వినాయక్ అయితే బాగుంటుందని అనుకున్నాం. నన్ను ‘దిల్’ రాజును చేసిన మా వి.వి.వినాయక్ను నటుడిగా మా బ్యానర్లో పరిచయం చేయబోతున్నాం. ఒక మంచి కథ, వినయ్కు కూడా వినిపించాం. తిరుమలేశుడి సన్నిధానంలో ఈ సినిమాను ప్రకటించండి అన్నయ్య అని వినయ్ కోరాడు. ఒక మంచి చిత్రం మా బ్యానర్లో వినయ్కు రాబోతోంది’ అని దిల్ రాజు వెల్లడించారు.
ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.
‘మహేష్ బాబు గారి 25వ సినిమా ‘మహర్షి’ విడుదల చేసి 5 రోజులు పూర్తయింది. మహేష్ బాబు కెరీర్లోని మంచి సినిమాల్లో ఇదీ ఒకటి. ఆల్ టైమ్ రికార్డ్ సినిమా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కేవలం కమర్షియల్ హిట్టే కాకుండా ఆ సినిమా ద్వారా రైతుల గురించి ప్రస్తావించి అందరిలో ఒక ఆలోచన వచ్చేలా చేశారు మా వంశీ, హరి టీమ్. ఇంత పెద్ద విజయాన్ని అందించిన స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాం’ అని దిల్ రాజు వెల్లడించారు.
ఇక వి.వి.వినాయక్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘దిల్’ సినిమాతో మొదలై 16 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. నా నామకరణం కూడా ‘దిల్’ రాజు అయిపోయింది. ఈ మధ్య ఒక స్క్రిప్ట్ విన్నాను. ఆ స్క్రిప్ట్కి ఎవరైతే బాగుంటారు అని ఆలోచిస్తుంటే రెండు రోజుల క్రితం వి.వి.వినాయక్ అయితే బాగుంటుందని అనుకున్నాం. నన్ను ‘దిల్’ రాజును చేసిన మా వి.వి.వినాయక్ను నటుడిగా మా బ్యానర్లో పరిచయం చేయబోతున్నాం. ఒక మంచి కథ, వినయ్కు కూడా వినిపించాం. తిరుమలేశుడి సన్నిధానంలో ఈ సినిమాను ప్రకటించండి అన్నయ్య అని వినయ్ కోరాడు. ఒక మంచి చిత్రం మా బ్యానర్లో వినయ్కు రాబోతోంది’ అని దిల్ రాజు వెల్లడించారు.