యాప్నగరం

Karthikeya 2: బలి పశువులను చేయొద్దు.. సినిమా కోసం నా ప్రాణం ఇస్తా.. తెలియకపోతే మూసుకోండి: ట్రోల్స్‌పై దిల్ రాజు రియాక్షన్

కార్తికేయ 2 (Karthikeya 2) మూవీకి థియేటర్లు ఇవ్వలేదని.. సినిమాలను తొక్కేస్తున్నారంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)పై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. మీడియాపై కూడా కాస్త సీరియస్ అయ్యారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 16 Aug 2022, 4:00 pm
యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha), డైరెక్టర్ చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). అడ్వెంచ‌ర‌స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. ‘కార్తికేయ’ సీక్వెల్‌గా వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. మూడు రోజుల్లోనే వ‌ర‌ల్ద్ వైడ్‌గా రూ.15.44 కోట్లు షేర్‌.. రూ.26.50 కోట్లు గ్రాస్ క‌లెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నిఖిల్ చేసిన కామెంట్స్ తీవ్ర దూమరం రేపిన సంగతి తెలిసిందే. కార్తికేయ 2 మూవీకి థియేటర్స్ దొరకవని.. అక్టోబ‌ర్‌కి లేదా న‌వంబ‌ర్‌కి వెళ్లిపోండని తనతో అన్నారని అన్నాడు. దీంతో ఒక్కసారిగా మీడియా దృష్టి మొత్తం నిర్మాత దిల్ రాజు (Dil Raju)పైకి వెళ్లింది. ఆయనపై సోషల్ మీడియాలో కూడా బాగా నెగిటివ్ ప్రచారం జరిగింది. కార్తికేయ 2 సినిమాకు థియేటర్లు ఇవ్వలేదంటూ.. మంచి సినిమాలను తొక్కేస్తున్నారంటూ కొద్ది రోజులుగా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన కార్తికేయ 2 సినిమా సక్సెస్ మీట్‌‌కు దిల్ రాజు హాజరై.. వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాపై కూడా కాస్త సీరియస్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకుని రాయాలని.. తెలియకపోతే మూసుకుని ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu producer dil raju reacts about trolls on social media over nikhil siddhartha karthikeya 2 movie theaters issue
Karthikeya 2: బలి పశువులను చేయొద్దు.. సినిమా కోసం నా ప్రాణం ఇస్తా.. తెలియకపోతే మూసుకోండి: ట్రోల్స్‌పై దిల్ రాజు రియాక్షన్


కార్తికేయ-2 మంచి విజయాన్ని సాధించింది

కార్తికేయ-2 మూవీ ఇండియా వైడ్‌గా మంచి విజయం సాధించిందని దిల్ రాజు అన్నారు. జూన్, జులై నెలల సినీ ఇండస్ట్రీని భయపెట్టాయని.. ఈ నెలలో బింబిసార, సీతా రామం, కార్తికేయ-2 సినిమాలు మళ్లీ ఊపిరిపోశాయని అన్నారు. ''ఈ మూవీ రిలీజ్‌కు ముందు నుంచి నిఖిల్‌తో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను డైరెక్టర్ చందుకు ఫోన్ చేసి థ్యాంక్ యూ మూవీ జులై 22 డేట్స్ ఇవ్వాలని అడిగా.. తరువాత నిఖిల్, వివేక్ మా ఇంటికి వచ్చి మాట్లాడారు. మా మధ్య ఎంతో హెల్తీ రిలేషన్‌షిప్ ఉంది

చాలా బాధగా ఉంది..

కానీ కొందరు మా రిలేషన్‌షిన్‌ను బయటకు తీసుకువెళ్లి వేరేగా తీసుకువెళ్లి.. గ్యాప్స్ క్రియేట్ చేస్తారు. ఇలా సక్సెస్ రోజు నేను ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. నేను ఇప్పుడు మాట్లాడకపోతే మా మధ్య ఏదో ఉందని రాస్తారు. జులై 22 నుంచి మరో తేదీకి వెళతామని నిఖిల్, చందు అన్నారు. నేను వాళ్లకు థ్యాంక్స్ కూడా చెప్పాను. అక్కడితో సమస్య అయిపోయింది. తరువాత వాళ్లు ఆగస్టు 12కు వద్దామని అనుకున్నారు. ఈలోపే ఎవరికీ తోచింది వాళ్లు రాస్తున్నారు. సినిమాను తొక్కేస్తున్నారని ఏదేదో రాసేశారు.

డేట్స్ క్లాష్ అవ్వకుండా చూసుకోమన్నా..

ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఎవరూ సినిమాలను తొక్కుకోరు. సినిమా బాగా ఆడితే మేం ఆనందపడతాం. సినిమా బాగా ఆడితే అది మాకు ఊపిరిపోస్తుంది. క్లిక్స్‌, వ్యూస్ కోసం మమ్మల్ని బలి పశువులను చేయొద్దు. ఇంతకు ముందు కూడా నాపైనా ఇలాంటివి చాలా వచ్చాయి. నేను ఎప్పుడు ఓపికతో ఉంటాను. మళ్లీ చందు నా దగ్గరకు వచ్చి ఆగస్టు 12న వేరే సినిమాలు ఉన్నాయని అన్నారు. ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుకుని డేట్స్ క్లాష్ అవ్వకుండా ఒక రోజు అటు ఇటు చూసుకుని రండి అని నేను ఒక సలహా మాత్రమే ఇచ్చాను. కానీ ఈలోపే రాద్దాంతం మొదలుపెట్టారు.

తెలియకపోతే మమ్మల్ని అడగండి..

సినిమాను ఎవడైనా తొక్కుతాడా..? మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఏం తెలియకుండా రాళ్లు వేయకండి. నేను తప్పు చేస్త క్షమించమని అడుగుతాను. నేను సినిమా కోసం ప్రాణం ఇస్తా. సినిమా బాగోలేదంటే నేను నా భూజాలపై వేసుకుంటా.. ఇకనైనా తెలుసుకుని వాస్తవాలు రాయండి. మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి. లేకపోతే మూసుకుని ఉండండి..'' అంటూ దిల్ రాజు ఘాటుగా మాట్లాడారు. తాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాల్సిందని.. కానీ తనకు ఫీవర్ ఉండడంతో రాలేకపోయానని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.