శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఆంజనేయుడు పై 'నేనున్నాను' అనే ఒక పుస్తకాన్ని రచించారు. దీన్ని వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి పబ్లిష్ చేయించారు. భారతదేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయ మూల విరాట్టులతో, యంత్ర మంత్రం తంత్రాత్మకంగా పురాణపండ శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.ఈ పుస్తకాన్ని టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి లాంటి ప్రముఖులకు అందజేశారు.
ఆంజనేయుడిని ఆరాధించే చిరంజీవి 'అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో, పురాణపండ శ్రీనివాస్ అద్బుతంగా రాసిన ఈ పుస్తకం అద్భుతంగా ఉంది' అని పొగిడారు.అలాగే బాలకృష్ణ కూడా 'మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ఉంది' అని ప్రశంసించారు. వీళ్ళు మాత్రమే కాకుండా అనేకమంది పీఠాధిపతులు,మఠాధిపతులు కూడా ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే నేనున్నాను అనే ఈ పుస్తకం కేవలం టాలీవుడ్ ప్రముఖులకే కాదు బాలీవుడ్ ప్రముఖులకు కూడా అందజేశారు. పురాణపండ శ్రీనివాస్ నుండి ' నేనున్నాను 'గ్రంధాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ''తన ఆరాధ్య దైవం ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని , భాష రాకున్నా ఈ మహా గ్రంధాన్ని తన పూజా మందిరంలో ఉంచుతానని చెప్పారు.అలాగే ఈ పుస్తకాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు, వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు, గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ వైభవాన్ని సాయి కొర్రపాటి ఉచితంగా అందజేస్తున్నారు. ఈ పుస్తకం ముద్రించడానికి చాలా ఖర్చు అయినప్పటికీ హనుమంతుడుపై ఆయనకి ఉన్న భక్తితో ఈ పుస్తకాన్ని ముద్రించి డబ్బులకు కాకుండా ఉచితంగా అందజేస్తున్నారు.
ఆంజనేయుడిని ఆరాధించే చిరంజీవి 'అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో, పురాణపండ శ్రీనివాస్ అద్బుతంగా రాసిన ఈ పుస్తకం అద్భుతంగా ఉంది' అని పొగిడారు.అలాగే బాలకృష్ణ కూడా 'మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ఉంది' అని ప్రశంసించారు. వీళ్ళు మాత్రమే కాకుండా అనేకమంది పీఠాధిపతులు,మఠాధిపతులు కూడా ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే నేనున్నాను అనే ఈ పుస్తకం కేవలం టాలీవుడ్ ప్రముఖులకే కాదు బాలీవుడ్ ప్రముఖులకు కూడా అందజేశారు. పురాణపండ శ్రీనివాస్ నుండి ' నేనున్నాను 'గ్రంధాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ''తన ఆరాధ్య దైవం ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని , భాష రాకున్నా ఈ మహా గ్రంధాన్ని తన పూజా మందిరంలో ఉంచుతానని చెప్పారు.అలాగే ఈ పుస్తకాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు, వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు, గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ వైభవాన్ని సాయి కొర్రపాటి ఉచితంగా అందజేస్తున్నారు. ఈ పుస్తకం ముద్రించడానికి చాలా ఖర్చు అయినప్పటికీ హనుమంతుడుపై ఆయనకి ఉన్న భక్తితో ఈ పుస్తకాన్ని ముద్రించి డబ్బులకు కాకుండా ఉచితంగా అందజేస్తున్నారు.