యాప్నగరం

‘చిరుతో విభేదాలు నిజమే.. మళ్లీ కలవకూడదా’?

పదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌ పీఎస్వీ గరుడవేగ రూపంలో విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం కోసం తన ఆస్తులను సైతం తాకట్టుపెట్టారు.

TNN 7 Nov 2017, 2:50 pm
మెగాస్టార్ చిరంజీవితో తనకు మధ్య విభేదాలు రేపవద్దని యాంగ్రీ యంగ్‌మెన్, హీరో రాజశేఖర్ మీడియాను కోరాడు. ఆయన తాజా చిత్రం‘పీఎస్వీ గరుడవేగ ’ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ... చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ తమ సినిమాను చూసి అభినందిస్తూ బొకే కూడా పంపించారని ఆయన తెలియజేశారు. చిరంజీవితో విభేదాలు వచ్చిన కొద్దిరోజులకే సమసిపోయాయని రాజశేఖర్ వెల్లడించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో ఇద్దరం కలుసుకున్నామని, వివిధ ఫంక్షన్లకు కలిసే వెళ్లామని పేర్కొన్నారు.
Samayam Telugu psv garudavegarajasekhar refutes rumours about their relation with chiranjeevi
‘చిరుతో విభేదాలు నిజమే.. మళ్లీ కలవకూడదా’?


అయితే ఇటీవల తన సినిమా విడుదల సందర్భంగా ఎవరో ఒకరు ‘రాజశేఖర్‌ కు ఇప్పుడే బుద్ధొచ్చింది. చిరంజీవి గారికి సారీ చెప్పిన తర్వాత సినిమా ఆడుతుంది’ అంటూ రాశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైనా పద్దతా? అని ప్రశ్నించారు. విభేదాలు వచ్చిన తరువాత మళ్లీ తిరిగి కలుసుకోకూడదా? కలిసి మంచిగా ఉండకూడదా? అని ఆయన నిలదీశారు. దయచేసి ఇలాంటి వార్తలతో తమను విడదీయవద్దని చెబుతూ ఆయన మీడియాను కోరారు. మీడియా రాసిన వార్తలు చదివి అభిమానులు అపార్థం చేసుకుంటారని రాజశేఖర్ సూచించారు.

గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి రాజశేఖర్, జీవిత దంపతులు వెళ్లడం, అక్కడ వారికి మెగా ఫ్యామిలి నుంచి సాదర స్వాగతం లభించడం తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తుగా జీవిత సోదరుడు మురళి మృతిచెందడంతో ఆ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. తాము చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారు కానీ తాము తరచుగా సినిమా వేడుకలు, సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే ఉంటామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.