ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో పుల్లెల గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటించనున్నాడు. హీరోగా సినిమాల్లోకి రావడానికన్నా ముందు జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రావీణ్యం వున్న సుధీర్ బాబు ఈ బయోపిక్కి పూర్తి న్యాయం చేస్తాడని విశ్వాసం వ్యక్తంచేస్తోంది మూవీ యూనిట్.
ఇదిలావుండగా తాజాగా మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు.. తమ సినిమాను వచ్చే ఏడాది మార్చి నెలలో పట్టాలెక్కించనున్నట్టు స్పష్టంచేశాడు. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా క్రీడాకారుడిగా, కోచ్గా పుల్లెల గోపీచంద్ జీవితాన్ని ఆవిష్కరించనుంది.
ఇదిలావుండగా తాజాగా మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు.. తమ సినిమాను వచ్చే ఏడాది మార్చి నెలలో పట్టాలెక్కించనున్నట్టు స్పష్టంచేశాడు. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా క్రీడాకారుడిగా, కోచ్గా పుల్లెల గోపీచంద్ జీవితాన్ని ఆవిష్కరించనుంది.