యాప్నగరం

తమ్ముడు, తనయుడితో కలిసి వచ్చిన పూరి జగన్నాథ్

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి అందిన నోటీసుల మేరకు ప్రముఖ డైరెక్టర్ పూరి...

TNN 19 Jul 2017, 10:50 am
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి అందిన నోటీసుల మేరకు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈరోజు నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఆయన ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. తన తమ్ముడు సాయిరాం శంకర్, తనయుడు ఆకాష్ పూరిలతో కలిసి పూరి జగన్నాథ్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ కేసు దర్యాప్తుని ముందుడి నడపిస్తున్నారు.
Samayam Telugu puri jagannadh attended sit probe at nampally excise office
తమ్ముడు, తనయుడితో కలిసి వచ్చిన పూరి జగన్నాథ్


ఇప్పటికే అరెస్ట్ అయిన వారి నుంచి సేకరించిన వాంగ్మూలాల ప్రకారం తమ వద్ద వున్న సమాచారాన్ని క్రోడీకరించిన సిట్ బృందం ఓ ప్రశ్నావళిని రూపొందించుకున్నట్టు సమాచారం. ఆ ప్రశ్నావళితోపాటు ఇవాళ విచారణలో పూరి జగన్నాథ్ చెప్పే అంశాల ఆధారంగా అతడిని భవిష్యత్‌లో మరోసారి విచారణకి పిలిచే అవకాశం లేకపోలేదంటున్నాయి అధికారవర్గాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.