యాప్నగరం

పూరి జగన్నాథ్‌కి అసలైన అగ్నిపరీక్ష ఇదే!

డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రమేయం వున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...

TNN 19 Jul 2017, 7:52 pm
డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రమేయం వున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇవాళ ఉదయం నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారణకి హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైన ఈ విచారణ రాత్రి చీకటి పడేవరకు కొనసాగుతూనే వుంది. అరెస్ట్ అయిన నిందితులతోపాటు తమ ఇన్వెస్టిగేషన్‌లో సేకరించిన సమాచారం ప్రకారమే పూరి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టిన సిట్... అనంతరం అతడు చెప్పిన అంశాల్ని ధృవీకరించుకునేందుకు సమాయత్తం అవుతోంది.
Samayam Telugu puri jagannadh undergoing narcotics analysis test
పూరి జగన్నాథ్‌కి అసలైన అగ్నిపరీక్ష ఇదే!


పూరి జగన్నాథ్ డ్రగ్స్ వినియోగించారా లేదా అని తేల్చుకునేందుకు సిట్ అధికారులు శాస్త్రీయ పద్ధతులని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉస్మానియా ఆస్పత్రి నుంచి డాక్టర్స్ బృందం ఒకటి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకుంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల సూచనల మేరకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల బృందం పర్యవేక్షణలో పూరి జగన్నాథ్ నార్కోటిక్స్ అనాలసిస్ టెస్ట్ చేసినట్టు సమాచారం.

నియమనిబంధనల ప్రకారం ఈ టెస్టులో రిజల్ట్ అతడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలితే, తాను డ్రగ్స్ తీసుకోలేదు అని విచారణలో పూరి జగన్నాథ్ చెప్పిన విషయాల్లో నిజం లేదనే భావించాల్సి వుంటుందంటున్నారు అధికారులు. దీంతో ప్రస్తుతం ఈ కేసుపై ఫోకస్ చేస్తున్న వారి దృష్టి అంతా ఈ నార్కోటిక్స్ అనాలసిస్ టెస్ట్ రిపోర్ట్‌పైనే వుంది. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.