యాప్నగరం

నాన్న బ్యాంకాక్ వెళ్లేది అందుకే: ఆకాశ్

దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తాడని, అక్కడి బీచ్‌లో ఇసుక తిన్నెలపై కూర్చొని కథలు రాసుకుంటాడని చాలా వార్తలు వినే ఉంటారు.

Samayam Telugu 19 May 2018, 8:08 pm
ర్శకుడు పూరీ జగన్నాథ్.. ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తాడని, అక్కడి బీచ్‌లో ఇసుక తిన్నెలపై కూర్చొని కథలు రాసుకుంటాడని చాలా వార్తలు వినే ఉంటారు. దీనిపై ఆయన కుమారుడు ఆకాశ్ పూరి కూడా స్పందించాడు. ఆకాశ్ తండ్రి పూరీ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.
Samayam Telugu asdaaa


ఇటీవల ఆకాశ్ పూరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆయన స్టోరీలు రాయడానికే బ్యాంకాక్ వెళ్తాడనే విషయం నిజమేనని తెలిపాడు. ఇక్కడ ఉండే ఒత్తిళ్ల వల్ల ఆయన కథలపై దృష్టి పెట్టలేరని, అందుకే ఆయన బ్యాంకాక్‌ వెళ్లి కథలు సిద్ధం చేసి తిరిగి వస్తారని చెప్పాడు.

‘‘బ్యాంకాక్ అంటే నాన్న తీసిన ‘చిరుత’ సినిమాలో చూపించినట్లు మసాజులు మాత్రమే కాదు.. అది చాలా మంచి ప్రాంతం. అక్కడ మంచి కుటుంబాలు కూడా నివసిస్తాయి’’ అని ఆకాశ్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.