యాప్నగరం

సినిమా ఎవరితో.. రాజమౌళి క్లారిటీ!

‘బాహుబలి 2’ తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే సినిమాపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది.

TNN 1 Jan 2018, 10:09 am
‘బాహుబలి 2’ తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే సినిమాపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ మధ్య ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలసి తీసుకున్న ఓ ఫొటోను రాజమౌళి సోషల్ మీడియాలో పెట్టడంతో అది సంచలనమే సృష్టించింది. దీనిపై అనేకనేక కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ కొడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ తీస్తున్నారని, ఇది ఫిక్స్ అని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటి వరకు రాజమౌళి స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం తన తరవాత సినిమా గురించి ఈనెలలోనే రాజమౌళి ప్రకటన చేయనున్నారు.
Samayam Telugu rajamouli to announce his next movie soon
సినిమా ఎవరితో.. రాజమౌళి క్లారిటీ!


ఇటీవల తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన స్టోరీ లైన్ రాజమౌళికి బాగా నచ్చిందట. ప్రస్తుతం ఆ కథకి సంబంధించి స్క్రిప్ట్ పనులు నడుస్తున్నట్లు సమాచారం. అంతకు మించి దీని గురించి ఏ విషయమూ బయటకు రాలేదు. మరి ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ కోసమా.. లేదంటే వేరే హీరోతో తీస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే రాజమౌళి ప్రకటన వరకు ఆగాల్సిందే. మరి జక్కన్న తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో.. మల్టీస్టారర్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఎలాంటి షాకిస్తాడో వేచి చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.