యాప్నగరం

Rajashekar Health: వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వైద్యులు. క్రమంగా ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.

Samayam Telugu 31 Oct 2020, 5:41 pm
కరోనా సోకడంతో సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (శనివారం) ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు.
Samayam Telugu వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్
Rajashekar Health Bulletin


ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తాజా రిపోర్ట్‌లో వెల్లడించారు. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.

Also Read: ఆ వయసులోనే లైంగిక దాడి.. ఇండస్ట్రీలో సెక్సువల్ ఫేవర్ మస్ట్! గుట్టు బయటపెట్టిన సినీ నటి

ఇటీవలే తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం (ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత) కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటోంది సినీ లోకం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.