సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతుంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 10500 స్క్రీన్స్పై భారీగా విడుదలైన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసింది. టెక్నికల్ పరంగా ఇండియన్ సినిమా గర్వించేలా దర్శకుడు శంకర్ విజువల్ వండర్ చిత్రాన్ని రూపొందించారు. అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ థియేటర్స్కు వెళ్లిన ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందుకున్నప్పటికీ కథలో ఎమోషన్స్ కరువు కావడంతో చాలా మంది జస్ట్ ఓకే అనే కామెంట్తో సరిపెట్టేస్తున్నారు. దీనికి తోడు 3D ఫార్మేట్కు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటంతో మల్టీప్లెక్స్లు మాత్రమే హౌస్ ఫుల్ అవుతున్నాయి. బి, సి సెంటర్లలలో కలెక్షన్లు పుంజుకోవడం కష్టంగా మారింది.
ఇదిలా ఉంటే.. ‘2.0’ మూవీ విడుదలకు ముందే నాలుగు స్టార్లు వేసి రివ్యూ ఇచ్చేసిన యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తాజాగా ఈ మూవీ కలెక్షన్లను తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘2.0’ చిత్రాన్ని ద్వేషించే వాళ్లకు ఇదో పెద్ద చెంప దెబ్బ. ‘2.0’ బ్లాక్ బస్టర్ హిట్. ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి మూడు రోజుల్లో రూ. 150 కోట్లు కొల్లగొట్టింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ‘2.0’ మూవీ విడుదలకు ముందే నాలుగు స్టార్లు వేసి రివ్యూ ఇచ్చేసిన యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తాజాగా ఈ మూవీ కలెక్షన్లను తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘2.0’ చిత్రాన్ని ద్వేషించే వాళ్లకు ఇదో పెద్ద చెంప దెబ్బ. ‘2.0’ బ్లాక్ బస్టర్ హిట్. ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి మూడు రోజుల్లో రూ. 150 కోట్లు కొల్లగొట్టింది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.