యాప్నగరం

నడిగర్ సంఘం బిల్డింగ్‌కి శంకుస్థాపన

సౌత్ ఇండియన్ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) కోసం నిర్మించతలపెట్టిన భవనానికి ఇవాళ...

TNN & Agencies 31 Mar 2017, 6:40 pm
సౌత్ ఇండియన్ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) కోసం నిర్మించతలపెట్టిన భవనానికి ఇవాళ చెన్నైలో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఉళగ నాయగన్ కమల్ హాసన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి సౌతిండియన్ సెలబ్రిటీలు నాజర్ (నడిగర్ సంఘం అధ్యక్షుడు), విశాల్(నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి), కార్తి (కోశాధికారి), సూర్య, జయం రవి, ప్రకాశ్ రాజ్, శింభు, శివ కార్తికేయన్, వాణిశ్రీ, శారద, విజయకుమార్, సిమ్రాన్, వరలక్ష్మి శరత్ కుమార్, బిందు మాధవి, దేవయాని వివేక్‌లు హాజరయ్యారు.
Samayam Telugu rajinikanth attends foundation ceremony for nadigar sangam
నడిగర్ సంఘం బిల్డింగ్‌కి శంకుస్థాపన


టీ నగర్ రోడ్‌లోని హబీబుల్లా రోడ్‌కి సమీపంలో దాదాపు రూ.26 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ భవనం వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికల్లా అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఈ భవనం మొత్తానికయ్యే ఖర్చులో అధిక భాగం విశాల్, కార్తి అందిస్తుండటం విశేషం. ఈ ఇరువురూ తలా రూ. 5 కోట్ల చొప్పున భవన నిర్మాణానికి విరాళంగా అందించనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విశాల్.. 'ఇందులోంచి మేము ఒక్క పైసా కూడా సొంతానికి వాడుకోమని, నడిగర్ సంఘానికి ఏదో ఓ విధంగా మేలు చేయాలనేదే తమ లక్ష్యం' అని అన్నారు. వెయ్యి సీట్ల కెపాసిటీతో ఓ ఆడిటోరియం, ఒక కల్యాణ వేదిక, ప్రివ్యూ థియేటర్‌తోపాటు నడిగర్ సంఘం హెడ్ ఆఫీస్ వంటివి ఈ భారీ భవనంలో నిర్మాణం కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.